హెచ్‌1బీ వీసాల సమస్యపై స్పందించిన ప్రభుత్వం..!

- February 10, 2017 , by Maagulf
హెచ్‌1బీ వీసాల సమస్యపై స్పందించిన ప్రభుత్వం..!

హెచ్‌-1బీ వీసా సమస్యలు ఎదుర్కొంటున్న టెక్‌ ఉద్యోగులకు త్వరలోనే భారత్‌ పరిష్కారం చూపుతుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలో హెచ్‌-1బీ సంస్కరణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ వర్గాలు ఎదుర్కొనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. భారత్‌తో పాటు అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా ఇలాంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తి సహకారం అందజేస్తుందని ఆయన వెల్లడించారు. 'భారత ఐటీ కంపెనీలు అమెరికాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అవన్నీ అమెరికా ప్రభుత్వానికి దాదాపు 20 బిలియన్‌డాలర్ల వరకు పన్నుగా చెల్లిస్తున్నాయి. 4లక్షల మందికి పైగా అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఫార్చ్యూన్‌ 500 కంపెనీలతో సమానంగా అత్యున్నత ప్రమాణాల సేవలను అందిస్తున్నాయి' అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com