హెచ్1బీ వీసాల సమస్యపై స్పందించిన ప్రభుత్వం..!
- February 10, 2017
హెచ్-1బీ వీసా సమస్యలు ఎదుర్కొంటున్న టెక్ ఉద్యోగులకు త్వరలోనే భారత్ పరిష్కారం చూపుతుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలో హెచ్-1బీ సంస్కరణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ వర్గాలు ఎదుర్కొనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. భారత్తో పాటు అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా ఇలాంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తి సహకారం అందజేస్తుందని ఆయన వెల్లడించారు. 'భారత ఐటీ కంపెనీలు అమెరికాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అవన్నీ అమెరికా ప్రభుత్వానికి దాదాపు 20 బిలియన్డాలర్ల వరకు పన్నుగా చెల్లిస్తున్నాయి. 4లక్షల మందికి పైగా అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సమానంగా అత్యున్నత ప్రమాణాల సేవలను అందిస్తున్నాయి' అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









