హెచ్1బీ వీసాల సమస్యపై స్పందించిన ప్రభుత్వం..!
- February 10, 2017
హెచ్-1బీ వీసా సమస్యలు ఎదుర్కొంటున్న టెక్ ఉద్యోగులకు త్వరలోనే భారత్ పరిష్కారం చూపుతుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలో హెచ్-1బీ సంస్కరణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ వర్గాలు ఎదుర్కొనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. భారత్తో పాటు అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా ఇలాంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తి సహకారం అందజేస్తుందని ఆయన వెల్లడించారు. 'భారత ఐటీ కంపెనీలు అమెరికాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అవన్నీ అమెరికా ప్రభుత్వానికి దాదాపు 20 బిలియన్డాలర్ల వరకు పన్నుగా చెల్లిస్తున్నాయి. 4లక్షల మందికి పైగా అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సమానంగా అత్యున్నత ప్రమాణాల సేవలను అందిస్తున్నాయి' అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







