ఖైరతాబాద్ వినాయకునికి గవర్నర్ దంపతుల తొలిపూజలు !
- September 17, 2015
తెలంగాణలకు తలమానికమైన ఖైరతాబాద్ వినాయకుడు కోలువైనాడు.. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తొలిపూజలు జరిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు.. చవితి ఉత్సవాలను ప్రారంభించారు. సతీసమేతంగా ఖైరతాబాద్ వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖైరతాబాద్ విఘ్నేశ్వరునికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని.. ప్రజలు ఎప్పటి నుంచో ఇక్కడ భక్తి ప్రపత్తులతో వినాయకున్ని పూజిస్తున్నారని అన్నారు. అంతే కాదు హైదరాబాద్ లో హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఉండాలని భారత దేశ ఖ్యాతిని నలు దిశలా వెలిగేలా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో గణేశుడికి వారు కొత్త వస్త్రాలు కూడా సమర్పించారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ విఘ్నాలు తొలగి సంతోషంగా జీవించేలా చూడాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నానని తెలిపారు. గణేశ్ ఉత్సవాలను ప్రారంభించేందుకు వచ్చిన నరసింహన్ దంపతులను ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఘనంగా సత్కరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







