బాలకృష్ణ తప్పకుండా వస్తారు: చిరు
- February 12, 2017
దాదాపు పదేళ్ల తర్వాత 'ఖైదీ నంబర్ 150' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి వెండితెరను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బుల్లితెరపై అలరించడానికి రెడీ అవుతున్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్కు చిరంజీవి హోస్ట్గా వ్యవహరించారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలపై మీడియాతో తన అభిప్రాయాలను వెల్లడించారు చిరంజీవి. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనేది వినోదభరితమైన ఆట కాదని, భావోద్వేగాలతో కూడిన ఆట అని చిరంజీవి చెప్పారు. తాను నాగార్జున షోకు గెస్ట్గా వెళ్లానని, ఇప్పుడు ఆయన తన షోకు గెస్ట్గా రావడానికి ఒప్పుకున్నారని, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు తన షోకు వస్తారని మెగాస్టార్ అన్నారు.
'బాలకృష్ణ కూడా వస్తారా?' అన్న ప్రశ్నకు ''తప్పకుండా వస్తారు. మేమిద్దరం మంచి స్నేహితులం. మొన్న జరిగిన ఓ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశాం. నేను పిలిస్తే ఆయన తప్పకుండా వస్తారు.
ఆయనకూ ఆహ్వానం పంపిస్తాం'' అని బదులిచ్చారు చిరంజీవి. [స్టార్ మా లోగోను ఆవిష్కరించిన చిరంజీవి] ''సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తప్ప నాకు ఎవరూ సన్నిహితులు లేరు''. అని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించిన విషయం విధితమే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









