బాలకృష్ణ తప్పకుండా వస్తారు: చిరు
- February 12, 2017
దాదాపు పదేళ్ల తర్వాత 'ఖైదీ నంబర్ 150' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి వెండితెరను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బుల్లితెరపై అలరించడానికి రెడీ అవుతున్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్కు చిరంజీవి హోస్ట్గా వ్యవహరించారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలపై మీడియాతో తన అభిప్రాయాలను వెల్లడించారు చిరంజీవి. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనేది వినోదభరితమైన ఆట కాదని, భావోద్వేగాలతో కూడిన ఆట అని చిరంజీవి చెప్పారు. తాను నాగార్జున షోకు గెస్ట్గా వెళ్లానని, ఇప్పుడు ఆయన తన షోకు గెస్ట్గా రావడానికి ఒప్పుకున్నారని, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు తన షోకు వస్తారని మెగాస్టార్ అన్నారు.
'బాలకృష్ణ కూడా వస్తారా?' అన్న ప్రశ్నకు ''తప్పకుండా వస్తారు. మేమిద్దరం మంచి స్నేహితులం. మొన్న జరిగిన ఓ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశాం. నేను పిలిస్తే ఆయన తప్పకుండా వస్తారు.
ఆయనకూ ఆహ్వానం పంపిస్తాం'' అని బదులిచ్చారు చిరంజీవి. [స్టార్ మా లోగోను ఆవిష్కరించిన చిరంజీవి] ''సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తప్ప నాకు ఎవరూ సన్నిహితులు లేరు''. అని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించిన విషయం విధితమే.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







