బాలకృష్ణ తప్పకుండా వస్తారు: చిరు
- February 12, 2017
దాదాపు పదేళ్ల తర్వాత 'ఖైదీ నంబర్ 150' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి వెండితెరను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బుల్లితెరపై అలరించడానికి రెడీ అవుతున్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్కు చిరంజీవి హోస్ట్గా వ్యవహరించారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలపై మీడియాతో తన అభిప్రాయాలను వెల్లడించారు చిరంజీవి. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనేది వినోదభరితమైన ఆట కాదని, భావోద్వేగాలతో కూడిన ఆట అని చిరంజీవి చెప్పారు. తాను నాగార్జున షోకు గెస్ట్గా వెళ్లానని, ఇప్పుడు ఆయన తన షోకు గెస్ట్గా రావడానికి ఒప్పుకున్నారని, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు తన షోకు వస్తారని మెగాస్టార్ అన్నారు.
'బాలకృష్ణ కూడా వస్తారా?' అన్న ప్రశ్నకు ''తప్పకుండా వస్తారు. మేమిద్దరం మంచి స్నేహితులం. మొన్న జరిగిన ఓ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశాం. నేను పిలిస్తే ఆయన తప్పకుండా వస్తారు.
ఆయనకూ ఆహ్వానం పంపిస్తాం'' అని బదులిచ్చారు చిరంజీవి. [స్టార్ మా లోగోను ఆవిష్కరించిన చిరంజీవి] ''సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తప్ప నాకు ఎవరూ సన్నిహితులు లేరు''. అని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించిన విషయం విధితమే.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









