కాలిఫోర్నియాలో ఘోర రైలు ప్రమాదం, నీటిలో మునిగిన 22 బోగీలు...
- February 13, 2017కాలిఫోర్నియా: ఓ రైలు పట్టాలు తప్పడంతో, రైలులోని 22 బోగీలు నీటిలో పడిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ రైలులో కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో ప్రాణ హాని తప్పింది. కాలిఫోర్నియాలోని గ్రేటర్ శాన్ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో ట్రేసీ సిటి నుంచి స్కార్మెంటో మెట్రోపాలిటన్ ప్రాంతంలోని రోజ్విల్లేకు ఆహారపదార్థాలను తరలిస్తున్న గూడ్స్ రైలు ఎల్క్గ్రోవ్ సిటీకి వచ్చేసరికి పట్టాలు అదుపు తప్పింది. 33 బోగీలున్న రైలు ఈ ప్రమాదంలో 22 బోగీలు కోసుమీస్ నది పడిపోయాయని, అయితే ఆ సమయంలో ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణిస్తుండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని యూనియన్ పసిఫిక్ రైల్వేబోర్డు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







