పోస్టాఫీసుల్లో ట్రాఫిక్ జరీమానాల చెల్లింపు...
- February 13, 2017
పోస్ట్ ఆఫీసుల్లో ట్రాఫిక్ జరీమానాల చెల్లింపు సేవల్ని ప్రారంభిస్తున్నారు. దుబాయ్ పోలీస్ మరియు, వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ (ఇపిజి) మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దుబాయ్ పోలీసులు జారీ చేసే ట్రాఫిక్ జరీమానాల చెల్లింపును పోస్ట్ ఆఫీసుల్లో చేయడానికి వీలు కుదిరింది. పోస్టల్ నెట్ వర్క్ ద్వారా ఒకే గొడుగు కిందకి అనేక సేవల్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఓ భాగమని ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ యాక్టింగ్ సిఇఓ అబ్దుల్లా మొహమ్మద్ అలాష్రామ్ చెప్పారు. వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ యాక్టింగ్ మేనేజర్ సుల్తాన్ అల్ మహమౌద్ మాట్లాడుతూ, ఈ ఒప్పందంలో తామూ భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్, ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ సంయుక్తంగా పలు ఫైనాన్షియల్, పోస్టల్ సర్వీసుల్ని ఒకే గొడుగు కింద నిర్వహిస్తున్నాయని తెలిపారాయన.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







