ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి 62 ఏళ్లుగా స్నానం చేయని వ్యక్తి..
- February 14, 2017
మనం రోజూ శుచిగా శుభ్రంగా రోజూ స్నానం చేసి, అప్పటికప్పుడు వంట చేసుకొని తింటామ్... కానీ ఇరాన్ కు చెందిన ఓ వ్యక్తి గత 62 ఏళ్లుగా స్నానం లేదు.. పరిశుబ్రమైన తిండి తినడు. పదిమందిలో కలవకుండా ఒంటరిగా జీవిస్తూ కుళ్లిన ఆహారం తింటూ... మనిషి జీవితాన్ని కలలో కూడా ఊహించుకొని విధంగా జీవిస్తున్నాడు.. వివరాల్లోకి వెళ్తే...
దక్షిణ ఇరాన్ లోని డెజ్ గా అనే గ్రామానికి చెందిన అమో హాజీ(82) యువకుడిగా ఉన్న సమయంలో మానసిక ఆందోళనకు గురయ్యాడు.. అప్పటి నుంచి అతను గ్రామ పొలిమెరలో ఒంటరిగానే జీవిస్తున్నాడు.. కాగా అతనికి స్నానం అంటే కోపం వస్తుంది.. స్నానం చేస్తే తనకు హెల్త్ పాడైపోతుంది అని భావించి గత 62 ఏళ్లుగా స్నానం చెయ్యడం లేదు.. ఇక స్నానం మాత్రమే కాదు తాను తినే తిండి కూడా శుభ్రంగా ఉంటే హాజీ తినడం ఇష్టం ఉండదు... చనిపోయిన జంతువుల కళేబరాలను కుళ్లబెట్టికొని తింటాడు.. అతనికి కుళ్లిన ముళ్ళపంది మాంసం అంటే చాలా ఇష్టమని తెలిపాడు.. ఇక మంచి నీరు కూడా ఓ తుప్పు పట్టిన ఆయిల్ క్యాన్ లో వేసుకొని ఆ నీటినే రోజూ ఆరు లీటర్లు చొప్పున తాగుతాడు.. ఇక గడ్డం తల వెంట్రుకలను కట్టింగ్ చేయించుకొనే విధానం కూడా సరికొత్తది.. మంటల్లో తన జుత్తుని కాల్చుటూ.. ట్రిమ్మింగ్ చేసుకొంటాడు.. శరీరం మురికితో దుమ్ము ధూళీతో పరిశుబ్రంగా ఉంటాడు.. దీంతో ఇంతడిని ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







