బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫుల్ జోష్ లో...
- February 15, 2017బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనందానికి అవదుల్లేకుండా పోయాయి. ట్విటర్ ఖాతాలో ఆయన ఓ మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తన ఫాలోయర్స్ తో షేర్ చేసుకున్నారు 'బిగ్ బి' అమితాబ్. తన ట్విట్టర్ అకౌంట్లో 25 మిలియన్ల ఫాలోయర్స్ మార్క్ ను చేరుకున్నారు. 'నేను ఈ విషయాన్ని గమనించడం మరిచిపోయాను. 25 మిలియన్లు.. యేహా (మై తో దేఖ్నా బుల్ హి గయా.. 25 మిలియన్లు.. యేహా 25 మిలియన్లు)' అని ట్వీట్ లో రాసుకొచ్చారు అమితాబ్. రెండున్నర కోట్ల ట్విట్టర్ ఫాలోయర్స్ తో అమితాబ్ దూసుకుపోతున్నారు.
కొందరు ప్రముఖుల ట్విట్లర్ ఫాలోయర్లను గమనించినట్లయితే.. ప్రధాని నరేంద్ర మోదీ 2.71 కోట్ల మంది ఫాలోయర్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖులలో అమితాబ్ 2.5 కోట్ల ఫాలోయర్లతో రెండో స్థానంలో ఉన్నారు. షారుక్ ఖాన్ 2.34 కోట్లు, సల్మాన్ ఖాన్ 2.15 కోట్లు, దీపికా పదుకొనే17.4 కోట్లు, ప్రియాంక చోప్రా 16.3 కోట్ల ఫాలోయర్స్ తో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 13.9 కోట్ల మంది ఫాలో అవుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!