ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- May 21, 2024
హైదరాబాద్: బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాకు తెలియజేశారు. ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని వెల్లడించారు.
ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, తాను ఈ పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్ లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్నదానిపై విచారణ జరుపుతున్నామని సీపీ వివరించారు.
ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్ చేశామని, ఇందులో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని వెల్లడించారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా తెలుగు బుల్లితెర నటులు, మోడళ్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఈ రేవ్ పార్టీని ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!









