ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- May 21, 2024
హైదరాబాద్: బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాకు తెలియజేశారు. ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని వెల్లడించారు.
ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, తాను ఈ పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్ లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్నదానిపై విచారణ జరుపుతున్నామని సీపీ వివరించారు.
ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్ చేశామని, ఇందులో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని వెల్లడించారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా తెలుగు బుల్లితెర నటులు, మోడళ్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఈ రేవ్ పార్టీని ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్







