శశికళ శపథం!...
- February 15, 2017
చెన్నై: న్యాయస్థానం వద్ద లొంగిపోవడానికి చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరిన శశికళ మెరీనా బీచ్లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పిస్తూ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్పాలతో నివాళులర్పించిన తర్వాత శశికళ జయ సమాధి మీద గట్టిగా మూడు సార్లు చేత్తో చరిచి మరీ ఏదో శపథం చేశారు. వూహించని ఈ పరిణామానికి అందరూ బిత్తరపోయారు. సమాధి మధ్య భాగంలో తగిలేలా వంగి మరీ అరచేత్తో గట్టిగా చరిచారు శశికళ. ఒకసారి కొట్టడం.. ముకుళిత హస్తాలతో ఏదో ఉచ్చరించడం, మళ్లీ కొట్టడం, మళ్లీ ఉచ్చరించడం.. అలా మూడుసార్లు చేశారు. అనంతరం తిరిగి కారెక్కి బెంగళూరువైపు రోడ్డు మార్గంలో బయల్దేరారు.
జయ సమాధి సాక్షిగా శశికళ ఏదో శపథం చేశారని ఆ దృశ్యం చూసినవారికి అర్థమవుతోంది.
దాంతో శశి ఏమని శపథం చేసివుంటారన్న విషయం నిమిషాల్లోనే చర్చనీయాంశమైపోయింది. అనారోగ్యం కారణం చూపుతూ లొంగిపోయేందుకు నాలుగు వారాలు గడువుకోరిన శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. దాంతో ఆమె వెంటనే బెంగళూరు బయల్దేరారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







