వీసా మోసం కేసులో భారతసంతతి మహిళ...
- February 15, 2017
న్యూయార్క్: అమెరికాలో హెచ్-1బీ వీసాల మోసానికి సంబంధించిన కేసులో భారత సంతతికి చెందిన మహిళ దోషిగా తేలారు. రెండు ఐటీ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల నియామకంలో అక్రమాలకు పాల్పడ్డారని, ఫుల్టైం ఉద్యోగులుగా నియమించలేదని, ఫెడరల్ నియమాల ప్రకారం జీతాలు ఇవ్వలేదని ఆరోపణలతో నమోదైన కేసులో జెర్సీ సిటీకి చెందిన హెచ్ఆర్ మేనేజర్ హీరాల్ పటేల్(34) దోషిగా తేలినట్లు నీవార్క్ ఫెడరల్ కోర్టు వెల్లడించింది. హీరాల్కు అధికంగా అయిదేళ్ల జైలు శిక్ష, 2,50,000 అమెరికా డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది. జూన్లో శిక్ష ఖరారు కానుంది. హీరాల్ రెండు ఐటీ కంపెనీలకు హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు.
ఈ రెండు కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుని వారికి హెచ్-1బీ వీసాలు ఇప్పిస్తాయి.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









