వీసా మోసం కేసులో భారతసంతతి మహిళ...

- February 15, 2017 , by Maagulf
వీసా మోసం కేసులో భారతసంతతి మహిళ...

న్యూయార్క్‌: అమెరికాలో హెచ్‌-1బీ వీసాల మోసానికి సంబంధించిన కేసులో భారత సంతతికి చెందిన మహిళ దోషిగా తేలారు. రెండు ఐటీ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల నియామకంలో అక్రమాలకు పాల్పడ్డారని, ఫుల్‌టైం ఉద్యోగులుగా నియమించలేదని, ఫెడరల్‌ నియమాల ప్రకారం జీతాలు ఇవ్వలేదని ఆరోపణలతో నమోదైన కేసులో జెర్సీ సిటీకి చెందిన హెచ్‌ఆర్‌ మేనేజర్‌ హీరాల్‌ పటేల్‌(34) దోషిగా తేలినట్లు నీవార్క్‌ ఫెడరల్‌ కోర్టు వెల్లడించింది. హీరాల్‌కు అధికంగా అయిదేళ్ల జైలు శిక్ష, 2,50,000 అమెరికా డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది. జూన్‌లో శిక్ష ఖరారు కానుంది. హీరాల్‌ రెండు ఐటీ కంపెనీలకు హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
ఈ రెండు కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుని వారికి హెచ్‌-1బీ వీసాలు ఇప్పిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com