అబుధాబీలో ఇళ్ళలో, వీధుల్లో జంతు వధ నిషేధం- 500 దీర్హమ్ ల జరిమానా
- September 18, 2015
ఈద్-అల్-అధా మొదటిరోజు ఈ నెల 24న జరుపుకుంటున్న సందర్భంగా, అబుధాబీ లోని జంతు వధ శాలలు తయారవుతున్నాయి. అబూ ధాబీ సిటీ మునిసిపాలిటీ (ADCM) - అనారోగ్య పరిస్థితులు మరియు పర్యావరణ సమస్యలకు దారితీసే విధంగా ఇళ్లల్లో, వీధులలో, కూడళ్లలో బలి ఇవ్వడాన్ని నిషేధించింది; ఈ నిబంధన అతిక్రమించిన వారికి 500 దీర్హమ్ ల జరిమానా మరియు సదరు జంతువు కూడా జప్తు చేయబడుతుందని కూడా హెచ్చరించింది. అధా మొదటి రోజున జంతువులను బలి ఇవ్వడానికి, అబుధాబీ సామాజిక జంతు వధ శాల, బనీయాస్ జంతు వధ శాల,అల్-శమామా జంతు వధ శాల,అల్-వాత్బా జంతు వధ శాలలు ఉదయం 7 నుండి, సాయంత్రం 6 వరకు; మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుండి, సాయంత్రం 6 వరకు సిద్ధంగా ఉంటాయని ప్రజా ఆరోగ్య శాఖ డైరక్టర్ ఖలీఫా మొహమ్మద్ అల్ రుమైథీ తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







