అబుధాబీలో ఇళ్ళలో, వీధుల్లో జంతు వధ నిషేధం- 500 దీర్హమ్ ల జరిమానా
- September 18, 2015
ఈద్-అల్-అధా మొదటిరోజు ఈ నెల 24న జరుపుకుంటున్న సందర్భంగా, అబుధాబీ లోని జంతు వధ శాలలు తయారవుతున్నాయి. అబూ ధాబీ సిటీ మునిసిపాలిటీ (ADCM) - అనారోగ్య పరిస్థితులు మరియు పర్యావరణ సమస్యలకు దారితీసే విధంగా ఇళ్లల్లో, వీధులలో, కూడళ్లలో బలి ఇవ్వడాన్ని నిషేధించింది; ఈ నిబంధన అతిక్రమించిన వారికి 500 దీర్హమ్ ల జరిమానా మరియు సదరు జంతువు కూడా జప్తు చేయబడుతుందని కూడా హెచ్చరించింది. అధా మొదటి రోజున జంతువులను బలి ఇవ్వడానికి, అబుధాబీ సామాజిక జంతు వధ శాల, బనీయాస్ జంతు వధ శాల,అల్-శమామా జంతు వధ శాల,అల్-వాత్బా జంతు వధ శాలలు ఉదయం 7 నుండి, సాయంత్రం 6 వరకు; మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుండి, సాయంత్రం 6 వరకు సిద్ధంగా ఉంటాయని ప్రజా ఆరోగ్య శాఖ డైరక్టర్ ఖలీఫా మొహమ్మద్ అల్ రుమైథీ తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ









