భారత దేశంలో నిషేధించబడిన మసాలా దినుసులు బహ్రైన్ లో అమ్మకం!
- September 18, 2015
భారత దేశంలో కేరళ రాస్త్రానికి చెందిన ప్రసిద్ధ నిరాపారా బ్రాండ్ దినుసులు, ప్రమాదకర స్థాయిలలో స్టార్చ్ ను కలిగి ఉన్నందున వాటి అమ్మకాలు ఈ మాస ప్రారంభంలో నిషేధించబడ్డాయి. ఐనప్పటికీ ఇవి బహ్రైన్ లో ఆమ్మబడుతుండడం ఆశ్చర్యకరం! వీనిని అమ్ముతున్న దుఖాణాలకు వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులు అందుతున్నా, ఆరోగ్య శాఖ వారి నుండి ఆదేశాలు రాలేదనే సాకుతో వారు నిమ్మకు నీరెత్టినట్టు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఉత్పత్తుల డిస్ట్రీబుటర్ అందుబాటులోకి రానప్పటికీ, భారతదేశంలోని కధనాల ప్రకారం, సదరు ఉత్పత్తులు దుబాయి మునిసిపాలిటీ వారిచే ఆమోదింపబడ్దాయనే తెలిసింది. ఇక్కడకు వచ్చే ఉత్పత్తులు, కేరళ లో నిషేధించబడిన బేచ్ కు చెందినవి కాదని వారు సమర్ధించుకుంటున్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







