బెంగళూరు సరస్సులో మంటలు.. భారీ పొగలు..
- February 17, 2017
నగరంలోని బెల్లందూర్ సరస్సులో గురువారం సాయంత్రం మంటలు చెలరేగి నగరవాసులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ సరస్సులో గతంలో కూడా ఇలాగే మంటలు చెలరేగాయి. సరస్సులో తీవ్ర కాలుష్యం, ఒడ్డున ఇష్టానుసారంగా పడేస్తున్న వ్యర్థాలు, నీటిలో కలుస్తున్న రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. పెద్దఎత్తున వ్యాపించిన పొగల కారణంగా సమీపంలో ప్రజలు రోడ్లపై వెళ్లడానికి భయపడే విధంగా మారింది. అగ్నిమాపక సిబ్బందికి కూడా మంటలను చల్లార్చడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
నిన్న సాయంత్రం సమయంలో మంటలు చెలరేగి, పొగలు వస్తుండడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
సరస్సు చుట్టూ ఉన్న ఎండిపోయిన గడ్డి కూడా తరచూ మండుతుంటుంది. తరచూ ఇక్కడ మంటలు చెలరేగడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బెల్లందూర్, వర్తూర్లు బెంగళూరులోని అతి పెద్ద సరస్సులు. అయితే ఈ రెండు సరస్సులు చెత్త, పరిశ్రమల వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమయ్యాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సరస్సులను శుభ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సరిగ్గా ఆచరణలో పెట్టకపోవడంతో ఎలాంటి ఫలితం ఉండడం లేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







