ఉగ్రవాదాన్ని అంతం చేయండి: ఆర్మీకి ఆదేశాలు ఇచ్చిన నవాజ్
- February 17, 2017
తన వరకు వస్తే గాని ఆ బాధేంటో తెలియదనే సామెతుంది. పాకిస్థాన్కు ఇది సరిగ్గా వర్తిస్తుంది. ఉగ్ర దాడులపై భారత్ ఎంత గగ్గోలు పెట్టినా పాక్ పట్టించుకోలేదు. అయితే గత కొంతకాలంగా పాకిస్థాన్ ఆ ముష్కర దాడులకు బలవుతోంది. తాజాగా గురువారం సింధ్ రాష్ట్రంలోని సుఫీ మసీదుపై ఉగ్ర దాడి జరిగింది. 88 మంది ముస్లింలు మృతి చెందగా సుమారు 350 మంది గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ఈ ఘటనతో పాకిస్థాన్ ప్రభుత్వం మేల్కొంది. ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం ఆ దేశ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. గాయపడిన బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం భద్రతా దళాధిపతులతో నవాజ్ సమావేశమయ్యారు. పూర్తి బలాన్ని వినియోగించి ఉగ్రవాదులను ఏరివేయాలని పాక్ ఆర్మీని ఆదేశించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







