బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించిన భారత్

- February 17, 2017 , by Maagulf
బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించిన భారత్

మహిళల ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో సూపర్‌సిక్స్‌ పోరులో భారత్‌ విజయవంతంగా దూసుకుపోతోంది. కొలంబోలో శుక్రవారం భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 50ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155పరుగులు చేసింది. 156పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. 33.3ఓవర్లలో 158పరుగులు చేసి బంగ్లాదేశ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత జట్టుకు ఈ సిరీస్‌లో ఇది వరుసగా ఆరో విజయం. ఓపెనర్‌ మోనా మేష్రమ్‌(78, నాటౌట్‌), కెప్టెన్‌ మిథాలి రాజ్‌(73, నాటౌట్‌) చెలరేగడంతో భారత్‌ లక్ష్యాన్ని సులువుగా దాటింది. బౌలర్లు జోషి 3, డీపీ వైద్య 2, ఎస్‌ పాండే, ఆర్‌ఎస్‌ గయక్వాడ్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com