బంగ్లాదేశ్పై ఘనవిజయం సాధించిన భారత్
- February 17, 2017
మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో సూపర్సిక్స్ పోరులో భారత్ విజయవంతంగా దూసుకుపోతోంది. కొలంబోలో శుక్రవారం భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది.
టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155పరుగులు చేసింది. 156పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. 33.3ఓవర్లలో 158పరుగులు చేసి బంగ్లాదేశ్పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత జట్టుకు ఈ సిరీస్లో ఇది వరుసగా ఆరో విజయం. ఓపెనర్ మోనా మేష్రమ్(78, నాటౌట్), కెప్టెన్ మిథాలి రాజ్(73, నాటౌట్) చెలరేగడంతో భారత్ లక్ష్యాన్ని సులువుగా దాటింది. బౌలర్లు జోషి 3, డీపీ వైద్య 2, ఎస్ పాండే, ఆర్ఎస్ గయక్వాడ్ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







