ముంగోడీ కర్రీ..
- February 17, 2017
కావలసిన పదార్థాలు
కందిపప్పు- ఒక కప్పు, మినప్పప్పు- అర కప్పు, ఇంగువ- చిటికెడు, తరిగిన ఉల్లిపాయ, టమోట- ఒక్కోటి చొప్పున, పచ్చిమిర్చి- 3, అల్లం తురుము- ఒక టీస్పూను, జీలకర్ర- అర టీ స్పూను, ధనియాల పొడి- ఒక టీస్పూను, పసుపు- పావు టీ స్పూను, కారం- ఒక టేబుల్ స్పూను, ఉప్పు- తగినంత, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం
కందిపప్పు, మినప్పప్పులను ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టుకో వాలి. తర్వాత ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అర టీస్పూను అల్లం తురుము వేసి పుణుగుల్లా నూనెలో వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో 2 టీస్పూన్ల నూనె పోసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మిగిలిన అల్లం తురుము వేసి వేగించాలి. తర్వాత టమోటా, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి 2 నిమిషాలు వేగించి 2 గ్లాసుల నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించాలి. చివర్లో పుణుగులను వేసి మరో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









