జీతం తీసుకోవడంలో ఏడు రోజుల జాప్యం జరిగితే వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు
- February 18, 2017
కతర్ : వేతనాలు ఇవ్వడంలో యజమాని విఫలమై ఏడు రోజుల జాప్యం కనుక జరిగితే ఆ ఉద్యోగి వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక నూతన పాలక విధానం విధించనుంది. దీని ప్ర్రకారం ఉద్యోగులు వారి యజమానుల నుండి అభ్యంతరం లేదని ఒక సర్టిఫికెట్ (ఎన్ ఓ సి) పొందకుండానే వేరే ఉద్యోగాలు మారడానికి హక్కు ఏర్పడనుంది. అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నుండి ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం, ఈ విషయమై ఒక నిర్ణయం మంత్రివర్గ స్థాయిలో తీసుకోవడం జరిగనుందని వెనువెంటనే అది త్వరలో అమలు చేయబడుతుందని తెలిపారు .దేశంలో అన్ని సంస్థలు తమ తమ ఉద్యోగులకు నెలవారీ జీతాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిన తేదీ లోపున చెల్లించాలి లేని ప్రభుత్వం సూచిస్తుందని లేని పక్షంలో డ్యూ తేదీ నుండి ఏడు రోజుల సమయం లోపల ఆయా వేతనాలని చెల్లించాలని తెలిపారు. సంస్థ యాజమాన్యాలు అలా అవ్వకపోతే, అటువంటి కంపెనీల నుంచి ఉద్యోగులు ఉద్యోగ మార్పు కోరుకోవచ్చని తెలిపింది.వారు ఒప్పందం కాలం పూర్తి చేయక్కరలేదని వేరే ఉద్యోగం మారే వారికి హక్కు ఉంటుంది. కతర్ లో కొన్ని కంపెనీలు ప్రభుత్వం ఆ కంపెనీలు అటువంటివి గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అందుకే వేతన రక్షణ వ్యవస్థ పరిధిలోనికి ఆయా సంస్థలను తీసుకువచ్చినట్లు అయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







