యుఏఈలోని బంగ్లాదేశీ కార్మికుడి నిజాయితీ
- February 18, 2017
యుఏఈలో బంగ్లాదేశీ కార్మికుడు జహిర్ రెహ్మాన్, తనకు దొరికిన వాలెట్ని తనతోపాటు తీసుకెళ్ళిపోకుండా, అది పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగిచ్చి నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే, 42 ఏళ్ళ జహిర్ రెహమ్మాన్, నెలవారీగా 700 దిర్హామ్లు జీతానికి పనిచేస్తుంటాడు. పార్క్లోని ఓ బెంచ్పై అతనికి ఓ వాలెట్ కన్పించింది. అయితే దాన్ని అతను తీసుకుని, గంట సమయానికి పైగా ఎదురుచూశాడు ఎవరైనా దాని కోసం వస్తారేమోనని. అంతలో ఓ వ్యక్తి కంగారు పడుతూ ఆ వాలెట్ కోసం వచ్చాడు. జర్మనీకి చెందిన ఆండ్రియాస్ క్రాస్, ఆ వాలెట్ని పోగొట్టుకున్న వ్యక్తి. ఆండ్రియాస్ రాగానే, వివరాలు తెలుసుకుని రెహ్మాన్ అతనికి ఆ వ్యాలెట్ని ఇచ్చేశాడు. నేను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోగలను, వేరొకరి సొమ్ము కోసం ఆశపడనని ఈ సందర్భంగా రెహ్మాన్ చెప్పాడు. యూఏఈలో 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాడాయన. ఈ సంఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని తన విలువైన డాక్యుమెంట్స్, కొంత నగదు, డెబిట్ కార్డ్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ ఆ వ్యాలెట్లోనే ఉన్నాయని, రెహ్మాన్ రియల్ హీరో అని వాలెట్ సొంతదారు ఆండ్రియాస్ చెప్పారు. తన వ్యాలెట్ని తనకిచ్చినందుకుగాను ఆండ్రియాస్, రెహమాన్కి ప్రోత్సాహకం అందజేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









