రషీద్ బిన్ మొహమ్మద్ మృతికి సంతాపం ప్రకటించిన యూ. ఏ. ఈ., అధ్యక్షులు
- September 19, 2015
రాజకుమారుడు షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మృతికి యూ. ఏ. ఈ., అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సంతాపం వ్యక్తం చేశారు. కుమారుని మృతికి దుబాయ్ పరిపాలకులు, యూ. ఏ. ఈ., ఉపాధ్యక్షులు మరియు ప్రధాన మంత్రి హిజ్ హైనెస్ షేక్ మోహమ్మెడ్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కు తమ హృదయ పూర్వక సానుభూతిని తెలియజేశారు. గతించిన రాజకుమారుడు స్వర్గస్తుడవ్వాలని, అతని తల్లిదండ్రులకు ఆ అల్లా ఉపశమనాన్నివ్వాలని ప్రార్ధించారు.
అబుధాబీ యువరాజు మరియు యూ. ఏ. ఈ., సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ హిజ్ హైనెస్ షేక్ మొహమేద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ , షార్జా పరిపాలకుడు హిజ్ హైనెస్ షేక్ సుల్తాన్ బిన్ మోహమ్మెద్ అల్ కసీమి, ఫూజరీయా పరిపాలకుడు హిజ్ హైనెస్ షేక్ హమాద్ బిన్ మోహమ్మెద్ అల్ షార్కీ, రాస్ అల్ఖైమా పరిపాలకుడు, ఉమ్మ్ అల్ కువైన్ అధినేత షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ము'అల్లా, అజ్మాన్ పరిపాలకుడు - హిజ్ హైనెస్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నువైమీ తో సహా అరబ్ దేశాల ప్రముఖులు , వారి దర్బార్లు చిన్న వయసులోనే గతించిన రాజకుమారుని మృతికి తీవ్ర దిగ్భంతిని సంతాపాన్ని ప్రకటిస్తూ మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







