లిబియా సముద్ర తీరాన విషాదం

- February 21, 2017 , by Maagulf
లిబియా సముద్ర తీరాన  విషాదం

లిబియా తీరానికి సుమారు 74 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా నుంచి వలసదారులు ప్రయాణిస్తున్న రబ్బర్ బోటు పాడైంది. అందులో సుమారు 120 మంది ఉండవచ్చని వీరంతా సముద్రంలో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు.
ఇందులో 74 మృతదేహాలు సోమవారం లిబియాలోని జవ్వియా తీరానికి కొట్టుకొచ్చాయి. అధికారులు వీటిని సేకరించి ప్రత్యేకంగా కేటాయించిన స్మశాన వాటికకు తరలించారు. గత ఏడాది మధ్యధరా సముద్రంలో జరిగిన బోటు ప్రమాదాల్లో సుమారు 4579 మంది వలసదారులు మృతిచెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com