కిడ్నాపైన ఇండియన్ డాక్టర్ ను విడుదల చేసిన ఉగ్రవాదులు
- February 22, 2017
ఎట్టకేలకు లిబియా ఉగ్రవాదుల చెర నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన డాక్టర్ రామ్మూర్తి విడుదలయ్యారు. ఈ మేరకు ఆయన కుటుంబీకులకు సమాచారం అందింది.ఆయన లిబియాలోని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నారని, 25న ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కొసనం రామ్మూర్తి వైద్యుడు. కుటుంబంతో ఏలూరు శివారు దొండపాడులో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో 16 ఏళ్ల కిందట రామ్మూర్తి లిబియా వెళ్లారు. ఆయనను 2015 సెప్టెంబర్లో లిబి యాలోని సిర్త్ పట్టణంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన వారిలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తితో పాటు రామ్మూర్తి కూడా ఉన్నారని తెలియడంతో ఆయన భార్య, పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి వారి నిరీక్షణకు తెరపడింది. ఆయన బుధవారం లిబియాలోని ఇండియన్ ఎంబసీకి క్షేమంగా చేరుకో వడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







