ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

- February 23, 2017 , by Maagulf
ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.100కి 10 జీబీ వరకు అదనపు 3జీ, 4జీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ప్లాన్ కు ఇది అదనపు డేటా. రూ.500 పైబడిన ప్లాన్ తో కొనసాగుతున్నవారు ప్రస్తుతం 3జీబీ డేటాను పొందుతుంటే, మరో రూ.100 అదనంగా చెల్లించి 10జీబీ వరకు అదనపు డేటా పొందొచ్చు. ఈ ఆఫర్ కొన్నివారాల పాటు ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. 4జీ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి పోస్ట్ పెయిడ్ కస్టమర్ ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ 10జీబీ డేటా 28 రోజుల వరకు మాత్రమే వాలిడిటీ ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com