మృత్యువాత పడిన బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా

- September 20, 2015 , by Maagulf
మృత్యువాత పడిన బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా

బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) కన్ను మూశారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కోల్ కతాలోని బి.ఎం.బిర్లా ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన మే30, 1940న కలకత్తాలో జన్మించారు. జగ్మోహన్ దాల్మియా చిన్నపాటి నుండే క్రికెట్ ఆటపై చాలా ఆసక్తి చూపేవారు. ఆయన మంచి వికెట్ కీపర్ గా పేరు తెచ్చుకొన్నారు. కానీ ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన తండ్రి సంస్థలో చేరి దాని బాధ్యతలు స్వీకరించారు. జగ్మోహన్ దాల్మియా 1979లో బి.సి.సి.ఐ.లో సభ్యుడిగా చేరారు. అప్పటి నుండి బి.సి.సి.ఐ. అధ్యక్షుడుగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com