మాండలిన్ శ్రీనివాస్ కు నివాళిగా దేవీ శ్రీ ఆల్బమ్
- February 28, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, తన గురువు మాండలిన్ శ్రీనివాస్ కు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. ఫిబ్రవరి 28న మాండలిన్ శ్రీనివాస్ జయంతి సందర్భంగా గురవే నమః పేరుతో ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ పాటకు దేవీ శ్రీ స్వయంగా కాన్సెప్ట్ డిజైన్ చేసి, సంగీతం అందించి ఆలపించాడు. ఈ పాట కేవలం ఏదో ఒక భాషకు పరిమితం కావొద్దన్న ఉద్దేశంతో సంస్కృతంలో రూపొందించాడు. గురువు, సంగీతాల గొప్పదనాన్ని వివరిస్తూ రూపొందించిన ఈ పాటకు జొన్నవిత్తుల సాహిత్యం అందించారు.
'గురువు గొప్పదనాన్ని మాటల్లో చెప్పలేం అందుకే నేను సంగీతంతో చెప్పే ప్రయత్నం చేశానన్నా'డు దేవీ శ్రీ. అంతేకాదు తన గురువు మాండలిన్ శ్రీనివాస్ కు నివాళిగా రూపొందించిన ఈ పాటను ఆయనకు ఎంతో ఇష్టమైన కీరవాణి రాగంలో రూపొందించినట్టుగా తెలిపారు.
వీడియో రూపంలో కూడా రిలీజ్ కానున్న ఈ ఆల్బమ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాండలిన్ శ్రీనివాస్ అభిమానులు సహాయ సహకారాలు అందించారు. వారందరికీ దేవీ శ్రీ కృతజ్ఞతలు తెలియజేశాడు.
లహరి మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ ఆల్బమ్ ను రిలీజ్ చేయటంతో పాటు ప్రముఖ సంగీతకారులు ఉస్తాద్ అంజాద్ అలీఖాన్, డ్రమ్స్ శివమణి, మాండలిన్ యు రాజేష్ లతో కలిసి ద గ్రేట్ మాండలిన్ పేరుతో మ్యూజికల్ కన్సర్ట్ ను నిర్వహించనున్నారు. అతి చిన్న వయసులో దేవీ శ్రీ ప్రసాద్ కు మాండలిన్ ను పరిచయం చేసిన శ్రీనివాస్, దేవీ కూడా మాండలిన్ విద్వాంసుడిగా ఎదగాలని ఆశించారు. తరువాత సంగీత దర్శకుడిగా మారిన దేవీ శ్రీ పలు వేదిక మీద మాండలిన్ శ్రీనివాస్ పట్ల తన గురుభక్తిని చూపించారు.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









