ఆంధ్రప్రదేశ్కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం
- February 28, 2017
ఆంధ్రప్రదేశ్కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం దక్కింది. సీఎన్బీసీ టీవీ18 అందించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మక 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం లభించింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల జాతీయస్థాయి ప్రముఖుల జ్యూరీ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. మార్చి 23న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కాగ, ఆంధ్రప్రదేశ్కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రావడం పట్ల ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.అభివృద్ది, టెక్నాలజీ వినియోగం, సమర్థ నాయకత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







