ఆంధ్రప్రదేశ్కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం
- February 28, 2017
ఆంధ్రప్రదేశ్కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం దక్కింది. సీఎన్బీసీ టీవీ18 అందించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మక 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం లభించింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల జాతీయస్థాయి ప్రముఖుల జ్యూరీ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. మార్చి 23న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కాగ, ఆంధ్రప్రదేశ్కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రావడం పట్ల ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.అభివృద్ది, టెక్నాలజీ వినియోగం, సమర్థ నాయకత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









