నిరుద్యోగులను మోసం చేసే ముఠా అరెస్ట్
- March 01, 2017
హైదరాబాద్ : నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తులను హైదరాబాదులోని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం ఉప్పల్ పోలీస్స్టేషన్లో ఏసీపీ గోనె సందీప్రావు వివరాలు వెల్లడించారు. మల్లాపూర్కు చెందిన నెమలి కుమార్(25), మౌలాలి జవహర్నగర్కు చెందిన లింగాల సుమిత్(26) అద్విత సేవా ఫౌండేషన్ పేరుతో మెగా ఉద్యోగ మేళా ను ఫిబ్రవరి 26న ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాలలో నిర్వహించారు.
ఈ మేరకు నిరుద్యోగుల నుంచి రూ.200 రిజిస్ట్రేషన్ చార్జీ వసూలు చేశారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. అయితే ప్రముఖ కంపెనీలు రాకపోవడం, సెక్యూరిటీగార్డులు, ఎల్ఐసీ ఏజెంట్ల వంటి ఉద్యోగాలు ఉండటంతో ఆగ్రహించిన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. అనుమతులు లేకపోవడం, మోసం చేయడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







