పెప్సీ, కోక్లను బహిష్కరించిన తమిళనాడు ప్రభుత్వం
- March 01, 2017
స్థానిక తయారీదారులను ప్రోత్సహించాలని పెప్సీ, కోక్ కంపెనీలను బహిష్కరిస్తున్నట్లు తమిళ వ్యాపారులు వెల్లడించారు. దీంతో పెప్సీ, కోక్లకు రూ.1400 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. రాష్ట్రంలోని అతి పెద్ద వాణిజ్య సంఘం తమిళనాడు వానిగర్ సంగమ్ పెప్సీ, కోక్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘంలో ఆరు వేలకు పైగా చిన్న మధ్య తరహా దుకాణాలు, 15 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. చిన్న చిన్న షాపుల్లోనూ ఇక నుంచి ఈ డ్రింక్స్ అమ్మబోరని సంఘం స్పష్టం చేసింది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు కొంత సమయం కావాలని అడిగినా, తాము అంగీకరించలేదని సంఘం వెల్లడించింది. గత జనవరి నెలలో జల్లికట్టు కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా వాణిజ్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తమిళులకు ఉన్న పట్టుదల మన తెలుగువారిక్కూడ వుంటే ఎంతబావుణ్ణు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







