ఇండోనేషియా చేరుకున్న సౌదీ రాజు సల్మాన్
- March 01, 2017
వెయ్యిమంది పరివారం.. మెర్సిడెస్ లిమోజిన్లు సహా 406 టన్నుల సరంజామాతో సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఇండోనేషియాలో కాలుమోపారు. జకార్తాలో 81 ఏళ్ల సల్మాన్ విమానం నుంచి ఎస్కులేటర్లో దిగారు. 47 ఏళ్లలో సౌదీ రాజు ఇండోనేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. సౌదీ మోనార్క్ రాక సందర్భంగా బొగొర్ ప్యాలస్లోని దిగంబర విగ్రహాలను వస్త్రాలతో కప్పారు. ఆయన ఓ మసీదును సందర్శించనున్న సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా వీఐపీ టాయ్లెట్ నిర్మించారు. 150 మంది వంటవాళ్లను నియమించారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా పేరుగాంచిన ఇండోనేషియాతో ఆర్థిక సంబంధాల మెరుగు కోసం సల్మాన్ పర్యటిస్తున్నారు. జకార్తాలో సమావేశాల అనంతరం ఆయన బాలిలో కొన్ని రోజులు విడిది చేస్తారు. అక్కడ అయిదు లగ్జరీ హోటళ్లు సిద్ధం చేశారు. విమానాల్లో తరలించిన టన్నులకొద్దీ సామగ్రి ఇప్పటికే బాలి తరలించారు. సౌదీ రాజు జపాన్, చైనా, మాల్దీవుల్లో కూడా పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







