హిమాచల్‌ప్రదేశ్‌కు రెండో రాజధానిగా ధర్మశాల

- March 02, 2017 , by Maagulf
హిమాచల్‌ప్రదేశ్‌కు రెండో రాజధానిగా ధర్మశాల

హిల్‌ స్టేట్ హిమాచల్‌ప్రదేశ్‌కు ఇక నుంచి దౌలందర్ రేంజ్‌లోని ధర్మశాల రెండో రాజధానిగా కొనసాగనుంది. ఈమేరకు రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర శీతాకాల రాజధానిగా ధర్మశాలను ప్రతిపాదిస్తున్నట్టు జనవరి 19న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా గురువారం సమావేశమైన కేబినెట్ ఆయన ప్రతిపాదనను అంగీకరిస్తూ ఆమోదం తెలిపింది. కాగా వచ్చే ఏడాది హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనుండడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com