జీడిపప్పు తింటే కొవ్వు పెరుగుతుందా..? లావైపోయి గుండె జబ్బులొస్తాయా?
- March 02, 2017
జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతారని కొందరు అపోహ పడుతుంటారు. ఐతే ఇది అపోహ మాత్రమే అంటారు ఆరోగ్య నిపుణులు. కాజు అని పిలిచే ఈ జీడిపప్పులో కొవ్వు శాతం తక్కువగా వుంటుంది. జీడిపప్పులో ఎ,బి,సి,డి,ఇ, కె విటమిన్లు వుంటాయి. అంతేకాదు వీటిలో ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ తదితర శక్తినిచ్చే ఖనిజ లవణాలు సమృద్ధిగా వుంటాయి.
జీడిపప్పుతో రక్తాభివృద్ధి కలుగుతుంది. ఎనిమియా వ్యాధిని అరికడుతుంది. నరాల బలహీనత కూడా తగ్గుతుంది. జీడిపప్పులో ప్రోటీనులు 21 శాతం, తేమ 6 శాతం, కార్బొహైడ్రేట్ 2 శాతం, పీచు 1-3 శాతం, కాల్షియం 0.5 శాతం వుంటాయి. వీటితోపాటు శరీర బరువును పెంచకుండా వుంచగల శక్తినిచ్చే ఫాట్ 41 శాతం వుంటుంది. ఈ ఫ్యాట్ వల్ల ఆరోగ్యకరంగా ఎలాంటి హానీ కలుగదు.
జీడిపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఆస్తమా, కిడ్నీ సమస్యలు, మోకాళ్ల నొప్పులు వున్నవారు జీడిపప్పును తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. జీడిపప్పును కొందరు పచ్చివిగానే తినేస్తారు. మరికొందరు వేయించుకుని తింటారు. ఇంకొందరు స్వీట్ పదార్థాలలో కలుపుకుని తింటారు. ఎలా తిన్నప్పటికీ జీడిపప్పుతో ఆరోగ్యానికి వచ్చే ముప్పేమీ లేదు.
తాజా వార్తలు
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









