ఆస్ట్రేలియా పర్యాటకులకు చేదు వార్త
- March 04, 2017
క్వీన్స్లాండ్ టూరిజం ఇండస్ట్రీ కౌన్సిల్ త్వరలోనే పర్యాటకులపై ఛార్జీల భారం మోపబోతోంది. హోటళ్ళు, మోటెల్స్, బెడ్, బ్రేక్ఫాస్ట్, హాలిడే పార్కులు, క్యాంప్ సైట్లు, ఇతర వసతుల్లో సేవలకు బిల్లుపై ఒక రాత్రికి 5 శాతం చొప్పున ఛార్జీలు విధించాలనే అంశం పరిశీలనలో ఉంది. ఎయిర్బీఎన్బీ వంటి ఆన్లైన్ ప్రొవైడర్ల ద్వారా చేసే బుకింగ్స్ కూడా ఈ విధంగా ఛార్జీలు విధించాలని ప్రతిపాదించింది. నోవోటెల్ బ్రిస్బేన్లో ఓ గదికి ఓ రాత్రికి 8.95 డాలర్లు, సౌత్పోర్ట్లోని మెరిటన్ సర్వీస్డ్ అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్కు 10.20 డాలర్లు ఛార్జీ విధించే అవకాశం ఉంది. కూలం బీచ్ హాలిడే పార్క్లో కేబిన్కు 8.90 డాలర్లు, హామిల్టన్ ఐలండ్ బంగళాకు నలుగురికి 20 డాలర్లు, బ్రిస్బేన్లోని స్టామ్ఫర్డ్ ప్లాజాలో ఒక సూట్కు 75.25 డాలర్లు ఛార్జీ విధించవచ్చు.ఈ ఛార్జీల విధింపుపై టూరిజం ఆపరేటర్లతో కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. అయితే టూరిజం విట్సండేస్ ఈ ఆలోచనను విమర్శించింది. అనేక ఇతర మార్గాలు ఉండగా ఈ విధంగా ఛార్జీలను వడ్డించాలనుకోవడం సహేతుకం కాదని విట్సండేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెయిగ్ టర్నర్ తెలిపారు.
తాజా వార్తలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- హైదరాబాద్లో ఆపిల్ రిటైల్ స్టోర్..
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!







