రవాణా సమయంలో గుండెపోటుతో మృతి చెందిన వలస భారతీయుడు
- March 06, 2017
సౌదీ అరేబియాలో ఒక నిర్వాసిత భారతీయుడు రవాణా సమయంలో బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుండెపోటుతో మరణించాడు. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో గురుసామి మూక్కన్, 49 సంవత్సరాల వయస్సు వ్యక్తికి హఠాత్తుగా గుండె ఆగిపోవడంతో మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.స్థానిక సామాజిక కార్యకర్త బషీర్ అంబాలాయి తెలిపిన సమాచారం మేరకు గురుసామి మూక్కన్ సౌదీ వీసా పునరుద్ధరించిన తరువాత రియాద్ నుండి గల్ఫ్ ఎయిర్ విమానం జి ఎఫ్ 068 ద్వారా భారతదేశం వెళ్లేందుకు ప్రయాణించే తన మార్గంలో ఈ మరణం సంభవించింది. భారతదేశం తమిళనాడు రాష్ట్రంలోని కొక్కడి గ్రామంకు చెందిన గురుస్వామి శుక్రవారం తన ప్రయాణ సమయంలో భాగంగా విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేయించుతున్నప్పుడు తనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు భావించాడు. దీనితో ఆయనను మూహ్యాయరాక్ లో కింగ్ హేమాడ్ విశ్వవిద్యాలయం హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు.ఈ వ్యక్తి చనిపోయిన వార్త భారత రాయబార కార్యాలయంలో నమోదు అయ్యింది. లాంఛన కార్యక్రమాలు పూర్తయ్యాయి భౌతిక కాయాన్ని భారతదేశంకు తరలింపుబడుతుంది.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







