రవాణా సమయంలో గుండెపోటుతో మృతి చెందిన వలస భారతీయుడు
- March 06, 2017
సౌదీ అరేబియాలో ఒక నిర్వాసిత భారతీయుడు రవాణా సమయంలో బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుండెపోటుతో మరణించాడు. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో గురుసామి మూక్కన్, 49 సంవత్సరాల వయస్సు వ్యక్తికి హఠాత్తుగా గుండె ఆగిపోవడంతో మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.స్థానిక సామాజిక కార్యకర్త బషీర్ అంబాలాయి తెలిపిన సమాచారం మేరకు గురుసామి మూక్కన్ సౌదీ వీసా పునరుద్ధరించిన తరువాత రియాద్ నుండి గల్ఫ్ ఎయిర్ విమానం జి ఎఫ్ 068 ద్వారా భారతదేశం వెళ్లేందుకు ప్రయాణించే తన మార్గంలో ఈ మరణం సంభవించింది. భారతదేశం తమిళనాడు రాష్ట్రంలోని కొక్కడి గ్రామంకు చెందిన గురుస్వామి శుక్రవారం తన ప్రయాణ సమయంలో భాగంగా విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేయించుతున్నప్పుడు తనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు భావించాడు. దీనితో ఆయనను మూహ్యాయరాక్ లో కింగ్ హేమాడ్ విశ్వవిద్యాలయం హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు.ఈ వ్యక్తి చనిపోయిన వార్త భారత రాయబార కార్యాలయంలో నమోదు అయ్యింది. లాంఛన కార్యక్రమాలు పూర్తయ్యాయి భౌతిక కాయాన్ని భారతదేశంకు తరలింపుబడుతుంది.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









