గ్యాస్‌ రెగ్యులేటర్‌లో బంగారం తరలింపు

- March 06, 2017 , by Maagulf
గ్యాస్‌ రెగ్యులేటర్‌లో బంగారం తరలింపు

దుబాయ్‌ నుంచి దొంగచాటుగా బంగారు తీసుకొస్తున్న ఇద్దరు ప్రయాణి కులను రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 622 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ సంస్థ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్టు స్కానింగ్‌లో తేలింది. లగేజీని తనిఖీ చేయగా గ్యాస్‌ రెగ్యులేటర్‌లో పెట్టుకుని తీసుకొస్తున్న 376 గ్రాముల బంగారం లభించింది. అతడిని నగరవాసిగా గుర్తించారు. మరో ప్రయాణి కుడు అనుమానాస్పదంగా కనిపించగా లగేజీ తనిఖీ చేయగా 246 గ్రాముల బంగారం దొరికింది.
ఇద్దరి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com