వీసా స్టేటస్ మార్పులకు కార్మికులు సానుకూలం
- September 23, 2015
విదేశీ కార్మికులు తమ వీసా స్టేటస్ మార్పుల కోసం సానుకూలంగా స్పందిస్తున్నారు. 232 మంది కార్మికులు వీసా స్టేటస్ మార్పుల కోసం ఇప్పటికే అంగీకారం తెలిపారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ప్రైవేట్ రంగలో పనిచేస్తున్న విదేశీ కార్మికుల వీసా స్టేటస్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. రెండు విభాగాలుగా వీసా స్టేటస్లో మార్పులు చేయబడ్తాయి. శాశ్వతంగా తాము పనిచేస్తున్న దేశం నుంచి బయటకు వెళ్ళాలనుకునేవారి కోసం మొదటిది, రెండవది తాము చేస్తున్న ఉద్యోగాన్ని మాత్రమే వదలాలనుకునేవారి కోసం వీసాలో మార్పులు చేయబడేది. 360 మంది కార్మికులు సెప్టెంబర్ 13 నుంచి 19 మధ్య కాలంలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలింది. ఇలా అరెస్ట్ అయినవారిలో 284 మంది కమర్షియల్ కార్మికులు కాగా, 40 మంది రైతులు, 36 మంది సేవకులు వున్నారు. వీరిలో 138 మంది అనుమతి లేకుండా తాము చేస్తున్న పనిని వీడారు. 202 మంది తొలగింపబడ్డారు. 15 మంది కూలీల గురించి ఆయా సంస్థలు ఫిర్యాదు చేశాయి.అల్ దఖిలియా గవర్నరేట్ 119 మంది అరెస్ట్ను ధృవీకరించింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ 94 మందిని అరెస్ట్ చేసింది. నిబంధనల్ని అతిక్రమించిన 205 మందిని దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







