వీసా స్టేటస్ మార్పులకు కార్మికులు సానుకూలం
- September 23, 2015
విదేశీ కార్మికులు తమ వీసా స్టేటస్ మార్పుల కోసం సానుకూలంగా స్పందిస్తున్నారు. 232 మంది కార్మికులు వీసా స్టేటస్ మార్పుల కోసం ఇప్పటికే అంగీకారం తెలిపారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ప్రైవేట్ రంగలో పనిచేస్తున్న విదేశీ కార్మికుల వీసా స్టేటస్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. రెండు విభాగాలుగా వీసా స్టేటస్లో మార్పులు చేయబడ్తాయి. శాశ్వతంగా తాము పనిచేస్తున్న దేశం నుంచి బయటకు వెళ్ళాలనుకునేవారి కోసం మొదటిది, రెండవది తాము చేస్తున్న ఉద్యోగాన్ని మాత్రమే వదలాలనుకునేవారి కోసం వీసాలో మార్పులు చేయబడేది. 360 మంది కార్మికులు సెప్టెంబర్ 13 నుంచి 19 మధ్య కాలంలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలింది. ఇలా అరెస్ట్ అయినవారిలో 284 మంది కమర్షియల్ కార్మికులు కాగా, 40 మంది రైతులు, 36 మంది సేవకులు వున్నారు. వీరిలో 138 మంది అనుమతి లేకుండా తాము చేస్తున్న పనిని వీడారు. 202 మంది తొలగింపబడ్డారు. 15 మంది కూలీల గురించి ఆయా సంస్థలు ఫిర్యాదు చేశాయి.అల్ దఖిలియా గవర్నరేట్ 119 మంది అరెస్ట్ను ధృవీకరించింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ 94 మందిని అరెస్ట్ చేసింది. నిబంధనల్ని అతిక్రమించిన 205 మందిని దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







