ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్కి రంగం సిద్ధం
- March 07, 2017ఐదు రోజులపాటు జరిగే ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్కి రంగం సిద్ధమయ్యింది. గ్రాండ్ హయాత్ మస్కట్లో మార్చ్ 15 నుంచి ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఒమన్లో ఇండియా అంబాసిడర్ ఇంద్రా మణి పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండియన్ ఎంబసీ - భారత మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తోంది. వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్, రాజస్తాన్ మరియు గోవా తదితర రాష్ట్రాలనుంచి అంతగా ప్రాచుర్యం లేని ప్రత్యేక ఆహార పదార్థాల్ని ఇక్కడ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నామని పాండే తెలిపారు. అలాగే మిగతా రాష్ట్రాల్లోని ప్రత్యేక వంటకాలకు లోటు ఏమీ ఉండదనీ, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆహార పదార్థాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. మెనూ చాలా కొత్తగా ఉంటుందనీ, ఎవరూ ఊహించని విధంగా ఏర్పాటు చేసే మెనూ అందరికీ నచ్చుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కోఆపరేషన్ ద్వారా ఇద్దరు చెఫ్లను ఎంపిక చేశారు. వారిద్దరూ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. గ్రాండ్ హయాత్ చెఫ్స్తో కలిసి వారు పనిచేస్తారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు