లక్నోలో ఉగ్రవాదులు కలకలం
- March 07, 2017లక్నోలోని ఠాకూర్గంజ్లో ఉగ్రవాదులు కలకలం రేపారు. ఓ ఇంట్లో చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద భారీ ఆయుధాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఉగ్రవాదుల్లో ఒకరిని సైఫుల్లాగా పోలీసులు గుర్తించారు. ఓవైపు పోలీస్ ఆపరేషన్ జరుగుతుండగా, మరోవైపు యూపీ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సమీక్ష జరుపుతోంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!