నరేంద్ర మోదీ ప్రారంభించిన దేశంలోకెల్లా పొడవైన కేబుల్ బ్రిడ్జి

- March 07, 2017 , by Maagulf
నరేంద్ర మోదీ ప్రారంభించిన దేశంలోకెల్లా పొడవైన కేబుల్ బ్రిడ్జి

దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్‌లో నర్మదా నదిపై నిర్మించిన ఈ వారధి పొడవు 1,344 మీటర్లు. వెడల్పు 22.8 మీటర్లు. రూ.379 కోట్ల ఖర్చయింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ. ఫోర్ లేన్ రోడ్డుతో పాటు మూడు మీటర్ల వెడల్పు ఫుట్ పాత్ కూడా ఉంది. 400కు పైగా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. 25 నుంచి 40 మీటర్లు పొడవు గల 216 కేబుల్స్ వినియోగించారు. అహ్మదాబాద్-ముంబై 8వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా ఈ వారధి నిర్మించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com