అమెరికాలో 15 ఏళ్ల జైలు శిక్ష భారతీయుడికి
- March 08, 2017
ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్నాడని ఓ భారతీయుడికి అమెరికా 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా ఓ భారత ఉన్నతాధికారిని చంపేందుకు కూడా ఇతడు పథకం వేశాడని విచారణలో తేలింది. బల్వీందర్ సింగ్ అనే ఈ 42 ఏళ్ళ వ్యక్తి స్వతంత్ర సిక్కు రాష్ట్రం కోసం ఉద్యమానికి ప్రేరేపించేలా ఉగ్రవాద దాడులకు కుట్రచేస్తున్నాడని అమెరికా అటార్నీ డానియెల్ బోగ్డెన్, ఎఫ్బీఐ స్పెషల్ ఏజెంట్ ఇంచార్జ్ ఆరోన్ సీ రౌజ్ కోర్టుకు నివేదించారు. ఇందుకోసం అతడు అమెరికాలో అతడుంటున్న రెనో నుంచి కాలిఫోర్నియాలోని అతడి సహచరుడ్ని వ్యక్తిగతంగా కలుసుకున్నాడని 2013లో ఇతడి బృందంలోని ఒకరు ఉగ్రదాడుల కోసం ఇండియా వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారని కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఇందుకోసం సదరు వ్యక్తికి రెండు సెట్లనైట్ విజన్ గూగుల్స్తో పాటు, ల్యాప్టాప్ కంప్యూటర్లను బల్వీందర్ సింగ్ సమకూర్చాడని పేర్కొన్నారు. విచారణ అనంతరం నిందితుడికి 180 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ రెనోలోని యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి లారీ హిక్స్ తీర్పు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO