ఓ ఇంట్లో దాక్కొన్న ఉగ్రవాదులు, ఆర్మీ కాల్పుల్లో ఒకరు హతం
- March 09, 2017
జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య గురువారం తెల్లవారుజాము నుంచీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. పడ్గంపొరా ప్రాంతంలోని ఓ ఇంట్లో దాక్కొని ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు గురువారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకుని కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులకు, సిబ్బందికి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు భద్రతా దళాల కాల్పుల్లో హతమైనట్లు తెలిసింది.
గత నాలుగు రోజుల్లో ఈ ప్రాంతంలో ఇది రెండో మేజర్ ఎన్కౌంటర్.
పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది హతమార్చారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు మరణించగా, ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







