ఓ ఇంట్లో దాక్కొన్న ఉగ్రవాదులు, ఆర్మీ కాల్పుల్లో ఒకరు హతం
- March 09, 2017
జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య గురువారం తెల్లవారుజాము నుంచీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. పడ్గంపొరా ప్రాంతంలోని ఓ ఇంట్లో దాక్కొని ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు గురువారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకుని కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులకు, సిబ్బందికి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు భద్రతా దళాల కాల్పుల్లో హతమైనట్లు తెలిసింది.
గత నాలుగు రోజుల్లో ఈ ప్రాంతంలో ఇది రెండో మేజర్ ఎన్కౌంటర్.
పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది హతమార్చారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు మరణించగా, ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









