ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై కఠినమైన చర్యలు
- March 09, 2017
హ్యూమన్ ఫుడ్ కంట్రోల్ రెగ్యులేషన్కి సంబంధించిన చట్టంలో కొత్త మార్పుల్ని తీసుకువస్తూ, డ్రాఫ్ట్ చట్టానికి అడ్వయిజరీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఇది అమల్లోకి వస్తే తక్కువలో తక్కువ 6 నెలల జైలు శిక్ష నుంచి గరిష్టంగా ఏడాది జైలు శిక్ష ఉల్లంఘనులకు పడుతుంది. అలాగే 7,000 ఖతారీ రియాల్స్ నుంచి 15,000 ఖతారీ రియాల్స్ వరకు జరీమానా కూడా పడుతుంది. ఒకవేళ ఉల్లంఘన రిపీట్ అయితే శిక్ష, జరీమానా డబుల్ అయ్యేలా చట్టంలో మార్పులు చేశారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉన్న నేపథ్యంలో చట్టానికి సవరణలు చేస్తున్నారు. గడువు తీరిన ఆహార పదార్థాలు సేవించిన వ్యక్తి ఒకవేళ పర్మనెంట్ డిజేబులిటీకి గురైతే దోషులపై జైలు శిక్ష 2 ఏళ్ళ దాకా ఉంటుంది, 15,000 నుంచి 30,000 ఖతారీ రియాల్స్ జరీమానా తప్పదు. నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసినా, సీజ్ చేసిన ఆహార పదార్థాల్ని అధికారుల అనుమతి లేకుండా తిరిగి వాడేందుకు ప్రయత్నించిరా చర్యలు అతి కఠినంగా ఉండబోతున్నాయి.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









