ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై కఠినమైన చర్యలు
- March 09, 2017
హ్యూమన్ ఫుడ్ కంట్రోల్ రెగ్యులేషన్కి సంబంధించిన చట్టంలో కొత్త మార్పుల్ని తీసుకువస్తూ, డ్రాఫ్ట్ చట్టానికి అడ్వయిజరీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఇది అమల్లోకి వస్తే తక్కువలో తక్కువ 6 నెలల జైలు శిక్ష నుంచి గరిష్టంగా ఏడాది జైలు శిక్ష ఉల్లంఘనులకు పడుతుంది. అలాగే 7,000 ఖతారీ రియాల్స్ నుంచి 15,000 ఖతారీ రియాల్స్ వరకు జరీమానా కూడా పడుతుంది. ఒకవేళ ఉల్లంఘన రిపీట్ అయితే శిక్ష, జరీమానా డబుల్ అయ్యేలా చట్టంలో మార్పులు చేశారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉన్న నేపథ్యంలో చట్టానికి సవరణలు చేస్తున్నారు. గడువు తీరిన ఆహార పదార్థాలు సేవించిన వ్యక్తి ఒకవేళ పర్మనెంట్ డిజేబులిటీకి గురైతే దోషులపై జైలు శిక్ష 2 ఏళ్ళ దాకా ఉంటుంది, 15,000 నుంచి 30,000 ఖతారీ రియాల్స్ జరీమానా తప్పదు. నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసినా, సీజ్ చేసిన ఆహార పదార్థాల్ని అధికారుల అనుమతి లేకుండా తిరిగి వాడేందుకు ప్రయత్నించిరా చర్యలు అతి కఠినంగా ఉండబోతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







