మోదీకి సారీ చెప్పిన జియో మరియు పేటిఎం కంపెనీలు
- March 10, 2017
ప్రధాని మోదీ ఫొటోని తమ వ్యాపార ప్రకటనల్లో వాడుకున్నందుకు క్షమించాలంటూ రిలయన్స్ జియో, పేటీఎం అభ్యర్థించాయి. సదరు విషయంపై రిలయన్స్ జియో, పేటీఎంలు క్షమాపణ చెప్పినట్టు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. రిలయన్స్ జియో మోదీ ఫొటోతో వివిధ పత్రికల్లో ఒక ఫుల్ పేజ్ వ్యాపార ప్రకటనను గత నెల సెప్టెంబర్ లో ఇచ్చింది. అలాగే పేటీఎం కూడా రెండు నెలల తర్వాత మోదీ డీమానిటైజేషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ డిజిటల్ వాలెట్ను వినియోగించాలని పత్రికల్లో అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చింది. ఈ వ్యాపార ప్రకటనలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పలు కోర్టులలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. దీంతో మోదీ ఫోటోగ్రాఫ్ లను తమ అడ్వర్ టైజ్ మెంట్లలో వాడుకున్నందుకు ప్రభుత్వం గత నెల ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







