మోదీకి సారీ చెప్పిన జియో మరియు పేటిఎం కంపెనీలు
- March 10, 2017
ప్రధాని మోదీ ఫొటోని తమ వ్యాపార ప్రకటనల్లో వాడుకున్నందుకు క్షమించాలంటూ రిలయన్స్ జియో, పేటీఎం అభ్యర్థించాయి. సదరు విషయంపై రిలయన్స్ జియో, పేటీఎంలు క్షమాపణ చెప్పినట్టు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. రిలయన్స్ జియో మోదీ ఫొటోతో వివిధ పత్రికల్లో ఒక ఫుల్ పేజ్ వ్యాపార ప్రకటనను గత నెల సెప్టెంబర్ లో ఇచ్చింది. అలాగే పేటీఎం కూడా రెండు నెలల తర్వాత మోదీ డీమానిటైజేషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ డిజిటల్ వాలెట్ను వినియోగించాలని పత్రికల్లో అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చింది. ఈ వ్యాపార ప్రకటనలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పలు కోర్టులలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. దీంతో మోదీ ఫోటోగ్రాఫ్ లను తమ అడ్వర్ టైజ్ మెంట్లలో వాడుకున్నందుకు ప్రభుత్వం గత నెల ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









