భళా మోడీ భళా!
- March 11, 2017
మళ్లీ మోడీ జపం పని చేసింది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేష్, ఉత్తరాంఖడ్, మణిపూర్, పంజాబ్, గోవా) ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్లింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో అత్యథిక బీజేపీ అత్యథిక స్థానాలు గెలుచుకోవడం విశేషం. ఈ ఉదయం నుంచి కొనసాగుతోన్న కౌంటింగ్ ముగిసింది. ఫైనల్ రిపోర్ట్ వచ్చేసింది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రంభంజనం సృష్టించింది. యూపీలో 403 స్థానాలకు గానూ.. బీజేపీ ఏకంగా 324 స్థానాలను కైవసం చేసుకొని విజయ దుందుబి మోగించింది. ఎస్సీ-కాంగ్రెస్ 54, బీఎస్పీ 19, ఇతరులు 5 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఉత్తరాఖండ్లోనూ 60 అసెంబ్లి స్థానాలకు గాను, బీజేపీ 56 స్థానాల్లో గెలుపొంది విజయకేతనం ఎగురవేసింది.
ఇక్కడ కాంగ్రెస్ 11, ఇతరులు 2 స్థానాల్లో గెలువగా, బీఎస్పీ ఖాతా తెరవలేకపోయింది.
పంజాబ్ మాత్రం కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 77, ఆమ్ ఆద్మీ పార్టీ 2, శిరోమీ అకాళీదల్-బీజేపీ 18, ఇతరులు 2 స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఇక, మణిపూర్, గోవాలో ఏ పార్టీ స్పష్టమైన మేజార్టీని చూపలేకపోయింది. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్లో కాంగ్రెస్ 25, బీజేపీ 21, ఇతరులు 11 స్థానాలను కైవసం చేసుకున్నారు. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 19, బీజేపీ 14, ఎంజీపీ కూటమి 3, ఇతరులు 4 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో.. ఈ రెండు రాష్ట్రాల్లో పొత్తులు-జిత్తులకి తెరలేచింది.
మొత్తంగా.. 2019 ఎన్నికలకి సెమీ ఫైనల్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజేతగా నిలిచింది. 2019లో మరోసారి అధికారం మనదేన్న ధీమాని పార్టీ శ్రేణులకి కలిగించింది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









