తెలంగాణ వాసి సౌదీలో గుండెపోటుతో మృతి
- March 12, 2017
పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆ కార్మికుడు తనకు రావాల్సిన బకాయిల కోసం కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలసిపోయి.. గుండెపోటుతో మరణించాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన పొన్నం సత్యనారాయణ (48) 20 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లాడు. ఒక నిర్మాణ సంస్ధలో పని చేస్తుండగా 2015 సంవత్సరం నుంచి చమురు సంక్షోభం కారణంగా పనులు తగ్గడంతో సకాలంలో జీతాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కార్మికుల బకాయిల చెల్లింపు కోసం కంపెనీ యాజమాన్యంపై సౌదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. దశల వారీగా బకాయిలు చెల్లిస్తున్న తరుణంలో సత్యనారాయణ గుండెపోటుతో మరణించడంతో తోటి కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన









