తెలంగాణ వాసి సౌదీలో గుండెపోటుతో మృతి

- March 12, 2017 , by Maagulf
తెలంగాణ వాసి సౌదీలో గుండెపోటుతో మృతి

పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆ కార్మికుడు తనకు రావాల్సిన బకాయిల కోసం కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలసిపోయి.. గుండెపోటుతో మరణించాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన పొన్నం సత్యనారాయణ (48) 20 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లాడు. ఒక నిర్మాణ సంస్ధలో పని చేస్తుండగా 2015 సంవత్సరం నుంచి చమురు సంక్షోభం కారణంగా పనులు తగ్గడంతో సకాలంలో జీతాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కార్మికుల బకాయిల చెల్లింపు కోసం కంపెనీ యాజమాన్యంపై సౌదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. దశల వారీగా బకాయిలు చెల్లిస్తున్న తరుణంలో సత్యనారాయణ గుండెపోటుతో మరణించడంతో తోటి కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com