తెలంగాణ వాసి సౌదీలో గుండెపోటుతో మృతి
- March 12, 2017
పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆ కార్మికుడు తనకు రావాల్సిన బకాయిల కోసం కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలసిపోయి.. గుండెపోటుతో మరణించాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన పొన్నం సత్యనారాయణ (48) 20 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లాడు. ఒక నిర్మాణ సంస్ధలో పని చేస్తుండగా 2015 సంవత్సరం నుంచి చమురు సంక్షోభం కారణంగా పనులు తగ్గడంతో సకాలంలో జీతాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కార్మికుల బకాయిల చెల్లింపు కోసం కంపెనీ యాజమాన్యంపై సౌదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. దశల వారీగా బకాయిలు చెల్లిస్తున్న తరుణంలో సత్యనారాయణ గుండెపోటుతో మరణించడంతో తోటి కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







