46 మంది సజీవసమాధి చెత్తకుప్పలు కూలి
- March 12, 2017
దేశరాజధాని అడిస్ అబాబా శివారు ప్రాంతంలోని కోషే వద్ద భారీ కొండల తరహాలో పోగుపడిన చెత్తాచెదారం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయి దిగువన ఉన్న నిరుపేదల మురికివాడను దాదాపుగా నేలమట్టం చేసింది. ఈ చెత్తకింద చిక్కుకుపోయి కనీసం 46 మంది మరణించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. మృతుల్లో అత్యధికులు మహిళలూ, పిల్లలే. శనివారం జరిగిన ఈ భారీ ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఎంతోమంది గల్లంతైపోయారు. చెత్తకుప్పలు కూలిపోయిన సమయంలో అక్కడ 150 మంది ఉన్నట్లు స్థానికులు చెప్పారు. యంత్రాల సాయంతో ఆ ప్రాంతాన్నంతా తవ్వుతూ అందులో చిక్కుకుపోయిన వారి కోసం సహాయబృందాలు అన్వేషిస్తున్నాయి.
దాదాపుగా స్థానికులంతా కూడా తెల్లారింది మొదలు ఆ చెత్తలో అదేపనిగా వెతికి పనికిరాకుండా పడేసిన డబ్బాలు, సీసాలు, ప్లాస్టిక్ వస్తువులు ఇతరాలను పోగుచేసి ఆ వ్యర్థాలను అమ్ముకుని పొట్టపోసుకునే వారే. రోజుకు కనీసం అయిదువందల మంది ఈ పనిలో నిమగ్నమై ఉంటారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా శివారుల్లోని కోషే వద్ద ఉన్న చెత్తయార్డులో గత యాభయ్యేళ్ల నుంచి పోగవుతున్న చెత్త పెద్ద కొండల వరసలా పేరుకుంది. సుమారు నలభైలక్షల మంది జనాభా ఉన్న అడిస్ అబాబాలోని చెత్తాచెదారం అంతా శివారులోని కోషేకు చేరుతుంది.
ఏటా కనీసం మూడులక్షల టన్నుల చెత్త ఇక్కడ పోగవుతుందని అంచనా. అయితే, గుప్పెడు మెతుకులకు నోచుకోని నిరుపేదలు చాలా మంది గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోనే చెత్తకుప్పలను ఆనుకునే చెక్కలు, కర్రలు, మట్టితో చిన్నచిన్న గుడిసెల్లాంటివి నివసిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడి పేదపిల్లలు ఆచెత్తలో వెతుక్కుని దొరికిన తిండే తింటున్నారన్న వార్తలు వెల్లువెత్తాయి.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









