పాకిస్తాన్ స్కూల్ విద్యార్ధులు లతా పాటను రోజూ ఆలపించే
- March 13, 2017
మన దేశం అంటే పాక్ విపరీతమైన ద్వేషం కురిపిస్తుంది.. కానీ ఆ ద్వేషం పాలకులకే గానీ ప్రజలకు లేదు అని మరో సారి రుజువైంది.. ఓ బాలీవుడ్ సినిమా పాట కు అరుదైన గౌరవం దక్కింది.. ఓ పాఠశాలలో ఆ పాటను రోజూ విద్యార్ధులతో పాడిస్తున్నారు.. అంతకంటే ఓ సినిమాకు కావలసిన గౌరవం ఏముంటుంది.. ? అదీ కూడా ఆ పాఠశాల పాకిస్తాన్ లో ఉందంటే అంతకంటే విశేషం ఏముంది? ఆ గౌరవం దక్కించుకొన్న పాట.. "దో ఆంఖే బరహ్ హాథ్" చిత్రంలో లతామంగేష్కర్ పాడిన 'యే మాలిక్ తేరే బందే హమ్...' పాట.. 1957 లో వచ్చిన ఈ పాట అప్పటి ప్రేక్షకుల హృదయాల్లో మరపురాని గీతంగా నిలిచిపోయింది.. ఈ పాట లోని భావం నచ్చిన ఓ పాకిస్తానీ పాఠశాల నిర్వహకులకు ఆ పాటలోని భావం నచ్చి తమ పాఠశాల గీతంగా స్వీకరించి రోజూ విద్యార్ధులతో పాడిస్తున్నారు.. కాగా ‘దో ఆంఖే బారహ్ హాథ్’ చిత్రం ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచిపోయింది. బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో సిల్వర్ బేర్ పురస్కారం తో పాటు.. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) అవార్డ్స్ ను గెలుచుకొన్నది
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







