ఈ నెల 15 న `ఆయుష్మాన్ భవ` మూవీ కర్టన్ రైజర్ వేడుక!!
- March 13, 2017
మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న `ఆయుష్మాన్ భవ` చిత్రం ఈనెల 15వ తేదిన పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్` వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. బాలీవుడ్ లో పలు హిట్ సినిమాలకు సంగీతం అందించిన మీట్ బ్రదర్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. `చెన్నై ఎక్స్ ప్రెస్`, `దిల్ వాలే` వంటి హిట్ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన డూడ్లీ ఈ సినిమాకు కెమెరా మేన్ గా వ్వవహరిస్తున్నారు. ఈ నెల 15న ప్రారంభం కానున్న సినిమా గురించి అదే రోజున చిత్ర యూనిట్ మాధాపూర్ ఎన్ కన్వెన్ హాల్ లో కర్టన్ రైజర్ వేడుకను నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా సి.టి.ఎఫ్ ప్రతినిధి చరణ్ తేజ్ మాట్లాడుతూ `` త్రినాధరావు నక్కిన, డూడ్లీ వంటి టాప్ టెక్నిషీయన్లతో సినిమా తెరకెక్కుతోంది. అలాగే సీనియర్ రైటర్స్ పరుచూరి ప్రదర్స్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఇంత మంది పెద్ద వాళ్లతో పాటు, మారుతితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. 15వ తేదిన పూజాకార్యక్రమాలు అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు టైటిల్ లోగో లాంచ్, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ కర్టన్ రైజర్ వేడుక చేస్తున్నాం. ఇలా సినిమా ప్రారంభం తర్వాత కర్టైన్ రైజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం` అని అన్నారు.
అలాగే ఈ కర్టన్ రైజర్ వేడుకలో మీట్ బ్రదర్స్ సంగీతంతో అలరించనున్నారు. ప్రముఖ హీరోయిన్ల డ్యాన్సులతో వేదిక మరింత కళకళలాడనుంది. ఈ వేడుకకు పలువురు దర్శక, నిర్మాతలు హజరు కానున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







