బేబీ డంపింగ్: మహిళను రప్పించిన అధికారులు
- March 14, 2017మనామా: ఓ విదేశీ మహిళ, న్యూ బోర్న్ బేబీని, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విడిచిపెట్టిన ఘటనకు సంబంధించి ఆ మహిళను బహ్రెయిన్ అధికారులు తిరిగి తీసుకురావడం జరిగింది. చైల్డ్ అండ్ ఫ్యామిలీ ప్రాసిక్యూషన్ డిప్యూటీ అటార్నీ హమాద్ అల్ గల్లాఫ్ మాట్లాడుతూ, ఆ మహిళ ఆసియా జాతీయురాలనీ, దుబాయ్ నుంచి ఆమెను బహ్రెయిన్కి రప్పించడం జరిగిందని చెప్పారు. ఇన్ఫాంట్ మృతదేహం, వేస్ట్ బిన్లో దర్శనమిచ్చింది. ఈ ఘటనతో అలర్ట్ అయిన అధికారులు, ఆ మహిళకు ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ని జారీ చేశారు. ప్రీ డెలివరీ కోసం నిందితురాలు కొన్ని ట్యాబ్లెట్స్ని వేసుకున్నట్లుగా విచారణలో నిర్ధారించారు. ఇంటర్పోల్ సహాయంతో ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చించి, ఆమెను బహ్రెయిన్కి తీసుకురాగలిగారు. మహిళ, విచారణ నిమిత్తం కస్టడీకి పంపబడింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









