యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు
- March 14, 2017
యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. కంపెనీలు, యజమానులు తమ వద్ద పని చేసే సిబ్బంది మతపరమైన చిహ్నాలను ధరించడంపై నిషేధం విధించవచ్చునని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు బురఖాలను ధరించడంపై ఇదే తొలి తీర్పు కావడం గమనార్హం. ఫ్రాన్స్, బెల్జియంకు చెందిన ఇద్దరు మహిళలు దాఖలు చేసిన రెండు కేసుల్లో కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ తీర్పునిచ్చింది. ''ఏదైనా రాజకీయ, సైద్ధాంతిక లేదా మతపరమైన చిహ్నాన్ని బహిరంగంగా కనిపించేవిధంగా ధరించడాన్ని నిషేధించే అంతర్గత నిబంధన ప్రత్యక్ష వివక్ష కాదు'' అని పేర్కొంది. ఫిర్యాదుదారులు బురఖాలను తొలగించేందుకు నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురయ్యారు. ఇదిలావుండగా, డచ్ ఎన్నికల సందర్భంగా ముస్లింల వలసలు కీలకాంశంగా మారాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









