యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు
- March 14, 2017
యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. కంపెనీలు, యజమానులు తమ వద్ద పని చేసే సిబ్బంది మతపరమైన చిహ్నాలను ధరించడంపై నిషేధం విధించవచ్చునని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు బురఖాలను ధరించడంపై ఇదే తొలి తీర్పు కావడం గమనార్హం. ఫ్రాన్స్, బెల్జియంకు చెందిన ఇద్దరు మహిళలు దాఖలు చేసిన రెండు కేసుల్లో కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ తీర్పునిచ్చింది. ''ఏదైనా రాజకీయ, సైద్ధాంతిక లేదా మతపరమైన చిహ్నాన్ని బహిరంగంగా కనిపించేవిధంగా ధరించడాన్ని నిషేధించే అంతర్గత నిబంధన ప్రత్యక్ష వివక్ష కాదు'' అని పేర్కొంది. ఫిర్యాదుదారులు బురఖాలను తొలగించేందుకు నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురయ్యారు. ఇదిలావుండగా, డచ్ ఎన్నికల సందర్భంగా ముస్లింల వలసలు కీలకాంశంగా మారాయి.
తాజా వార్తలు
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్









