యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు
- March 14, 2017
యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. కంపెనీలు, యజమానులు తమ వద్ద పని చేసే సిబ్బంది మతపరమైన చిహ్నాలను ధరించడంపై నిషేధం విధించవచ్చునని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు బురఖాలను ధరించడంపై ఇదే తొలి తీర్పు కావడం గమనార్హం. ఫ్రాన్స్, బెల్జియంకు చెందిన ఇద్దరు మహిళలు దాఖలు చేసిన రెండు కేసుల్లో కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ తీర్పునిచ్చింది. ''ఏదైనా రాజకీయ, సైద్ధాంతిక లేదా మతపరమైన చిహ్నాన్ని బహిరంగంగా కనిపించేవిధంగా ధరించడాన్ని నిషేధించే అంతర్గత నిబంధన ప్రత్యక్ష వివక్ష కాదు'' అని పేర్కొంది. ఫిర్యాదుదారులు బురఖాలను తొలగించేందుకు నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురయ్యారు. ఇదిలావుండగా, డచ్ ఎన్నికల సందర్భంగా ముస్లింల వలసలు కీలకాంశంగా మారాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







