దాడులను నియంత్రణకు భారతీయులకు రక్షణగా ప్రచారం
- March 14, 2017
- జాతివిద్వేష దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతివిద్వేష దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ-అమెరికన్ల ప్రజావ్యవహారాల సంయుక్త కమిటీ పేరుతో చికాగోలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నారు. భారత సంతతి ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఐఏపీఏసీ సభ్యుడు అశ్విన్ ధాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నలుగురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఐఏపీఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు.
శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా, న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగో, డల్లాస్, సియాటెల్ ప్రాంతాల్లో తొలుత ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. కన్సాస్ రాష్ట్రంలో భారతీయుడు కూచిబొట్ల శ్రీనివాస్పై జరిగిన దాడుల వంటివి ఇకపై జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటన ద్వారా తెలిపారు. అధికారులు, స్థానికులు, వ్యాపారులు దీనిలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









