దాడులను నియంత్రణకు భారతీయులకు రక్షణగా ప్రచారం
- March 14, 2017
- జాతివిద్వేష దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతివిద్వేష దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ-అమెరికన్ల ప్రజావ్యవహారాల సంయుక్త కమిటీ పేరుతో చికాగోలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నారు. భారత సంతతి ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఐఏపీఏసీ సభ్యుడు అశ్విన్ ధాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నలుగురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఐఏపీఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు.
శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా, న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగో, డల్లాస్, సియాటెల్ ప్రాంతాల్లో తొలుత ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. కన్సాస్ రాష్ట్రంలో భారతీయుడు కూచిబొట్ల శ్రీనివాస్పై జరిగిన దాడుల వంటివి ఇకపై జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటన ద్వారా తెలిపారు. అధికారులు, స్థానికులు, వ్యాపారులు దీనిలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త







