దాడులను నియంత్రణకు భారతీయులకు రక్షణగా ప్రచారం
- March 14, 2017
- జాతివిద్వేష దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతివిద్వేష దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ-అమెరికన్ల ప్రజావ్యవహారాల సంయుక్త కమిటీ పేరుతో చికాగోలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నారు. భారత సంతతి ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఐఏపీఏసీ సభ్యుడు అశ్విన్ ధాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నలుగురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఐఏపీఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు.
శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా, న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగో, డల్లాస్, సియాటెల్ ప్రాంతాల్లో తొలుత ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. కన్సాస్ రాష్ట్రంలో భారతీయుడు కూచిబొట్ల శ్రీనివాస్పై జరిగిన దాడుల వంటివి ఇకపై జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటన ద్వారా తెలిపారు. అధికారులు, స్థానికులు, వ్యాపారులు దీనిలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







