రాజస్థాన్‌లో కుప్పకూలిన సుఖోయ్‌-30 విమానం

- March 15, 2017 , by Maagulf
రాజస్థాన్‌లో కుప్పకూలిన సుఖోయ్‌-30 విమానం

సుఖోయ్‌-30 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్‌ ప్రాణాలతో సురక్షితంగా తప్పించుకున్నారు. రాజస్థాన్‌ బర్మర్‌ జిల్లా శివకర్‌ కుద్లా గ్రామం వద్ద బుధవారం విమానం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన ఈ విమానాన్ని ఉత్తర్‌లాయి ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ లో ల్యాండ్‌ చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన ధుర రామ్‌ ఆయన భార్య, మనవడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com